వినాయక చవితి రోజు ప్రజలు పరీక్ష పెడుతున్న విగ్నేశ్వరుడు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రజలు తెల్లవారుజాము నుండి ఏకధాటిగా కురుస్తున్న ఏమి చేయాలో గణపతి పూజ ఎలా నిర్వహించాలో తెలియక భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సాధారణంగా వర్షపాతం కురుస్తున్నప్పటికీ, కామారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆ జిల్లా ప్రజలు ఏక దాటిగా కురుస్తున్న వర్షానికి నరకాన్ని చూస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను తరలించేందుకు ఆయా గణేష్ మండలి నిర్వాహకులు జిల్లావ్యాప్తంగా నలుమూలల ప్రాంతాల నుండి భారీ వినాయక విగ్రహాలను తీసుక వెళ్తున్నారు.