| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సుజాతనగర్ మండలంలో గణేష్ నవరాత్రుల కమిటీ వారికి పలు సూచనలు తెలియజేసిన సుజాతనగర్ ఎస్ఐ ఎం రమాదేవి

సుజాతనగర్ మండలంలో గణేష్ నవరాత్రుల కమిటీ వారికి పలు సూచనలు తెలియజేసిన సుజాతనగర్ ఎస్ఐ ఎం రమాదేవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో వినాయక ప్రతిష్ట మరియు మండపాలను నిర్వహించే కమిటీ సభ్యులను సుజాతనగర్ పోలీస్ స్టేషన్ నందు అందరిని ఆహ్వానించి వారికి ఎస్ఐ ఎం .రమాదేవి పలు సూచనలు తెలియజేసినారు

వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యులు పాటించాల్సిన నియమ నిబంధనలు గురించి క్రింది విధంగా వివరించి సూచనలు ఇచ్చారు.గణేష్ విగ్రహాలను ప్రతిష్టించుటకు పోలీసు వారు ఇచ్చిన లింక్ నందు లాగిన్ అయ్యి ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి మండపాల వద్ద  అనుమతించిన  పరిమితిలోనే లౌడ్ స్పీకర్ల సౌండ్ ఉంచాలి. రాత్రి 10 గంటల తర్వాత బిగ్గరగా సాంగ్స్ ప్లే చేయరాదు.చట్టుపక్కల వారికిఎలాంటి  అసౌకర్యo  కలిగించరాదు ఎలక్ట్రిసిటీ  డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి.రహదారులను,రోడ్లను మూసివేసే విధంగా మండపాలను రోడ్లకు అడ్డంగా పెట్టరాదుమండపం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.మండపం వద్ద ప్రతిరోజు ఒక కమిటీ మెంబర్ రాత్రి సమయంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలను పాటించాలి. పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.విగ్రహ ప్రతిష్ట, విసర్జన తేదీలను,సమయాలను ఖచ్చితంగా నిర్ణయించుకొని పోలీస్ వారికి తెలియజేయాలి.వేడుకలు సామరస్యపూర్వకంగా జరిగేలా చూడాలి. ఏ విధమైన వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.                                     

మండపాల వద్ద DJ లకు అనుమతి లేదు.  మండపాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటన జరిగినా వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలి సుజాతనగర్ ఎస్సై ఎం రమాదేవి అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Previous భద్రాచలం వద్ద గోదావరి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
Next సహస్ర హత్య కేసులో వీడిన మిస్టరీ
ADVERTISEMENT