Posted on 2025-08-11 15:14:03
డైలీ భారత్, చందుర్తి : యూరియా కొరతతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో అర్ధరాత్రి వరకు మహిళా రైతులు క్యూ లైన్లో నిలుచొని యూరియా కోసం అవస్థలు పడ్డ విషయం మరవకముందే.. చందుర్తిలో చెప్పులతో క్యూలైన్ పెట్టారు. చందుర్తి సహకార సంఘంలో సోమవారం యూరియా పంపిణీ విషయం తెలుసుకున్న రైతులు ఉదయమే చేరుకొని చెప్పులు క్యూ లైన్ పెట్టారు.
జిల్లాలో ఎరువుల కొరత లేదని ఒకవైపు అధికారులు ప్రకటనలు ఇస్తుండగానే యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఒక ఎకరానికి ఒకే బస్తా యూరియా మాత్రమే ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బంది పడుతూ గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం, మండలంలో ఎరువుల కోసం రైతుల అవస్థలు పడుతుండటం గమనార్హం.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >
మహిళా లెక్చరర్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
Posted On 2026-07-29 08:51:28
Readmore >