డైలీ భారత్, తెలంగాణ : హైదరాబాద్లోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటనపై రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ (TGHRC) సుమోటో కేసు నమోదు చేసింది. వచ్చే నెల 28లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లా జ్యోతిబా పూలే సంక్షేమ హాస్టల్ లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపైనా కేసు నమోదు చేసింది. ఆగస్టు 28లోగా రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)ని ఆదేశించింది.
News
సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటనపై సుమోటో కేసు నమోదు