డైలీ భారత్, సింహాచలం :ఏపీలో సింహాచలం దేవస్థానంలో వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం (నిజరూప దర్శనం) వచ్చే నెల 30వ తేదీన జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరప్రసాద్ తెలిపారు. చందనోత్సవానికి భారీఎత్తున భక్తులు హాజరుకానున్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చందనోత్సవం నేపథ్యంలో ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి దర్శనాలు నిలిపివేయాలని, భక్తులకు ఈ విషయం తెలియజేయాలని అధికారులకు సూచించారు.
News
ఏప్రిల్ 30న అప్పన్న చందనోత్సవం