Posted on 2025-03-20 09:08:00
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అన్నారం గ్రామంలోని SC మాల కులానికి చెందిన అనేక కుటుంబాలు (95%) హిందూ ధర్మాని వదిలి క్రైస్తవాన్ని స్వీకరించి రాజ్యాంగ విరుద్దంగా ఇప్పటికీ దొంగ SC సర్టిఫికేట్లతో రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారనీ అలాంటి వారిపై రాజ్యాంగ బద్దంగా, చట్ట బద్దంగా రాజ్యాంగం లోని ఆర్టికల్ 341 ప్రకారం వారికి SC సర్టిఫికేట్లు రద్దు చేసి BC-C సర్టిఫికేట్లు ఇవ్వాలని మణుగూరు తహసీల్దారు ని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది, అన్నారం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా రెండు చర్చిలు నిర్మించి రెవిన్యూ కార్యాలయం లో హిందువులమని అబద్దాలు చెప్పి దొంగ SC సర్టిఫికేట్లు పొంది రాజ్యాంగాన్ని మోసం చేస్తూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే SC సర్టిఫికేట్లు రద్దు చేసి BC C సర్టిఫికెట్లు ఇచ్చి నిజమైన SC లకు న్యాయం చెయ్యాలని స్ధానిక తహసీల్దారు ని కోరడం జరిగింది,
ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు , జిల్లా సంఘటన చిట్టెంశెట్టి లక్ష్మయ్య , జిల్లా సత్సంగ ప్రముఖ్ నెట్టెం రాధాకృష్ణ , జిల్లా సామాజిక సమరసతా ప్రముఖ్ గొడ్ల రాజయ్య, జిల్లా సేవా ప్రముఖ్ ఉమా శంకర రాజు, పినపాక ప్రఖండ కార్యదర్శి చిలకమారి లక్ష్మణ్, గంటా రాధ , లింగంపల్లి రమేష్ , పోతురాజు వెంకన్న తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >