డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:సిరిసిల్ల పట్టణం సుందరయ్యనగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన దేవులపెల్లి స్వరూప-కీ.శే. బాలయ్య కూతురు ఆరాధ్య(మౌనిక) వివాహం సందర్భంగా స్థానిక 36 వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు 50 కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వధువు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజుకి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, లింగంపెల్లి దేవయ్య మరియు వధువు బంధువులు పాల్గొన్నారు.