డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శ్రీశ్రీశ్రీ అంబా భవాని మాత దేవాలయం ఎలికట్ట ప్రతి శుక్రవారం అమ్మవారికి ఉదయం 6 గంటలకు అభిషేకం చేశారు. శ్రీ శ్రీ శ్రీ అంభ భవాని మాత దేవాలయానికి మొగిలిగిద్ద గ్రామ వాస్తవ్యులు కక్కునూరి (తౌడు) వెంకటేశం గుప్తా రూ.3,00,000 విలువ చేసే 2.8 కిలోల వెండి ధారపాత్ర మహా శివుడి అభిషేకానికి ఇప్పించడం జరిగింది. వెంకటేష్ గుప్తా గారు భవాని మాత టెంపుల్ చైర్మన్ ముత్యాల రాజు కు ఆ యొక్క పాత్ర అందించడం జరిగింది. పాల్గొన్నవారు కమిటీ మెంబర్స్ వెంకటరామిరెడ్డి ఆంజనేయులు గౌడ్ మరియు గ్రామస్తులు అమ్మవారు భక్తులు పాల్గొన్నారు ఈరోజు వెంకటేష్ గుప్తా కుటుంబ సభ్యులు అభిషేకం చేయడం జరిగింది.. వారికీ వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్ల వేళల ఉండాలని కోరుకుంటున్నాము..
News
భవాని మాతకు రూ.3,00,000 విలువ చేసే 2.8 కిలోల వెండి ధారపాత్ర బహుకరణ