Posted on 2025-02-04 05:47:00
హైడ్రా ప్రజావాణికి 71 ఫిర్యాదులు
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: గేటెడ్ కమ్యూనిటీల మాదిరి కాలనీల చుట్టూ రహదారులను నిర్మించిన పక్షంలో వాటిని వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు.మొత్తం ఫిర్యాదుల్లో అధికభాగం పార్కులు, రహదారుల కబ్జాలే ఉన్నాయని.. లే ఔట్ ప్రకారం రహదారులుండేలా చూడాలని సూచించారు.సోమవారం హైడ్రా ప్రజావాణికి 71కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై అక్కడికక్కడే హైడ్రా అధికారులతో చర్చించి చర్యలకు హైడ్రా కమిషనర్ ఆదేశించారు.ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను గూగుల్ మ్యాప్స్ద్వరా పరిశీలించి.. దశాబ్దం క్రితం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకున్నారు. ఫిర్యాదు దారులకు కూడా చూపించి.. సమస్య పరిష్కారానికి చర్యలు సూచించారు. ఫిర్యాదుదారులు సంప్రదించాల్సిన హైడ్రా అధికారులను పరిచయం చేసి.. వారు విచారణకు వచ్చిన సమయంలో అన్ని వివరాలు అందజేయాలని సూచించారు.ఒకప్పడు సెప్టిక్ ట్యాంకుల కోసం కేటాయించిన స్థలాలను.. ఇప్పుడు వినియోగంలో లేవని.. వాటిని ప్రజావసరాలకు కేటాయించిన స్థలంగానే పరిగణించాలని.. ఎవరైనా కబ్జాలుచేస్తే వెంటనే వాటిని తొలగించాలని కమిషనర్ అధికారులకు సూచించారు.
బస్టాండ్ ఏర్పాటు చేయాలనీ మంత్రి పొన్నంను కలిసిన కాంగ్రెస్ నేతలు
Posted On 2026-05-12 16:37:06
Readmore >
బీటెక్ విద్యార్థి "యవన్" దారుణ హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు : 10 మంది నిందితుల అరెస్ట్
Posted On 2026-05-12 06:24:26
Readmore >
నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు
Posted On 2026-05-11 21:02:02
Readmore >
మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-05-11 20:42:59
Readmore >
రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్
Posted On 2026-05-11 20:38:54
Readmore >