Posted on 2025-02-02 12:49:30
"ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలి"
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటి, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రేనే హాస్పిటల్ కరీంనగర్ సౌజన్యంతో పవర్ లూమ్ కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం జయప్రకాష్ నగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు రాపెల్లి లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ కార్మికులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈరోజుల్లో బీపీ, షుగర్ లాంటి వ్యాధులు అందరికి వస్తున్నాయని అన్నారు. ప్రతి 3నెలలకు ఒక సారి ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని కార్మికులకు సూచించారు.
రైనే హాస్పిటల్ డాక్టర్ ఆలయ 150 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినారు.
ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ మాటాడుతూ కార్మికుల సంక్షేమం కోసం హెల్పింగ్ హార్ట్స్ నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ పట్ల జాగ్రత్తలు తెలియజేశారు.
హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్ మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం, పౌష్టికాహారం ఆవశ్యకతను కార్మికులకు తెలియజేయడం కోసం ప్రతి వీధిలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ కె.పున్నం చందర్, హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ దాసరి తిరుమల,మాజీ ఎంపీటీసీ బుర్ర మల్లిఖార్జున్, ఆడేపు చంద్రకళ, వంతడ్పుల రాము, వేముల దామోదర్, గుర్రం శంకర్, అవధూత శ్రీహరి, చిందం సాయికుమార్, అభి, మాదాసు గంగారం హాస్పిటల్ స్టాఫ్ మరియు కార్మికులు పాల్గొన్నారు.
గండుగులపల్లి ఏకలవ్య స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు
Posted On 2026-03-13 13:26:57
Readmore >
జేకే మల్టీకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం
Posted On 2026-03-13 13:16:52
Readmore >
"కార్మికులు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్
Posted On 2026-03-13 12:25:43
Readmore >