| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

16 ఏళ్ల లోపు పిల్లలకు రాత్రి సినిమా ప్రదర్శనలపై హైకోర్టు ఆదేశాలు

16 ఏళ్ల లోపు పిల్లలకు రాత్రి సినిమా ప్రదర్శనలపై హైకోర్టు ఆదేశాలు

డైలీ భారత్, తెలంగాణ డెస్క్:రాష్ట్ర వ్యాప్తంగా 16 ఏళ్ల లోపు పిల్లలను రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలోకి అనుమతించకూడదని హైకోర్టు ఆదేశించింది. 

చైల్డ్ సైకాలజిస్టులతో పాటు అన్ని పక్షాలతో చర్చించిన అనంతరం, ఈ వయసు గల పిల్లల కోసం ఉదయం 11 గంటల ముందు లేదా రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లలో ప్రవేశాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోర్టు సిఫార్సు చేసింది.

సినిమా టిక్కెట్ల ధర పెంపు, స్పెషల్ షోల అనుమతిపై విచారణ సందర్భంగా, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 

అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున పిల్లలు సినిమాలు చూడటం వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యంలో ప్రతికూల ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయపడింది.

పిల్లల ఆరోగ్యం మరియు నిద్రపై ఇలాంటి షోల ప్రభావం ఉండకూడదని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయమూర్తికి వివరించారు. 

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.

Previous జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిటికెన ముసలయ్య అసైన్మెంట్ పంటపొలన్ని ధ్వంసం చేసిన దుండగులు
Next సూర్యాపేటలో యువకుడిని బండ రాళ్లతో మోది హత్య చేసిన కేసులో సంచలన విషయాలు
ADVERTISEMENT