డైలీ భారత్, డెస్క్ : నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన "భరతమాతకు మహా హారతి" కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి భారీగా బాణసంచా పేల్చారు. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్ లో రెండు బోట్లకు మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో బోట్లలో ఉన్న 15 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
News
హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం...రెండు బోట్లు దగ్ధం