లోగోను ఆవిష్కరించిన రాష్ట్ర జేఏసీ చైర్మన్ మంద రంజిత్ కుమార్..
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ లోని జేఎన్టీయూ యూనివర్సిటీ లో మంగళవారం నాడు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఛైర్మన్ మంద రంజిత్ కుమార్ కొత్తగా రూపొందించిన లోగోను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ లోగో విద్యా విలువలను ప్రతిబింబించేలా, ప్రతి అంశానికి ప్రత్యేకమైన అర్థంతో రూపకల్పన చేయబడిందని వివరించారు.
అలాగే ఈ జేఏసీ లోగో కమిటీ లక్ష్యాలను, అభివృద్ధి దిశలో దృక్పథాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుందని, ప్రతి రంగు మరియు రూపకల్పన విద్యా పురోగతికి సూచించేదిగా రూపొందించబడిందని తెలిపారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో జేఎన్టీయుహెచ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కొత్తూరు పవన్ కుమార్ తో పాటు రాష్ట్ర జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.