డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు రావాలని, అత్యవసర సమయాలలో 100 కు ఫోన్ చేయాలని, పేకాట, గుట్కా, మట్కా ,అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కు పాదం మోపుతామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలందరూ సహకరించాలని తెలియజేసినారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా సహకరించి, మెరుగైన సమాజం కోసం తమ వంతు తోడ్పాటు అందించాలని కోరుకుంటూ జూలూరుపాడు ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన బాధావతు రవి అన్నారు ఏ సమస్య అయినా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని అలాగే 100 కి డయల్ చేయండి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
News
జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన బాధావతు రవి