డైలీ భారత్ తెలంగాణ: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందించారు. మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలపై ఆరా తీశారని, నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని గవర్నర్ సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
News
గవర్నర్ తమిళిసైని కలిసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు