Posted on 2024-02-25 17:55:33
డైలీ భారత్, రాజన్నసిరిసిల్ల జిల్లా: పువ్వు పుట్టగానే పరమ ళిస్తుందన్న నానుడి ఆ చిన్నారికి అక్షరాలా సరిపోతుంది. కేవలం ఐదు నెలల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అందరి నోట ఔరా అనిపిస్తోంది.
అమ్మ అని పలకడం కూడా రాని చిట్టి వయసులో 70కి పైగా వస్తువులను గుర్తించి అందరి ప్రశంసలు అందు కోవడమే గాక, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లు చోటు కూడా సంపాదించింది ఆ చిన్నారి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన వేముల సాగర్-సౌమ్య ల కూతురు సంవేద్యకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది.
అమ్మానాన్నలను గుర్తించడమే కష్టమైన వయసులో 70కి పైగా కేటగిరీలలో వస్తువులను గుర్తించడం ద్వారా సంవేద్య తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులను ఆకట్టుకుంది.
చిన్నారి ప్రతిభకు అబ్బుర పడిన ప్రతినిధులు బంగారు పతకంతో సన్మానించడమే కాకుండా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేశారు. పాప రంగులను గుర్తించడం చూసి వివిధ రకాల కేటగిరీలో వస్తువు లను చూపించడం ద్వారా వాటిని గుర్తించేలా ప్రాక్టీస్ చేయించామని తల్లిదండ్రులు తెలిపారు.
తమ చిన్నారి పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్హెచ్ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >