తెలంగాణ మంత్రి కొండ సురేఖ
డైలీ భారత్, తెలంగాణ: అనారోగ్యం బారిన పడ్డారు. ఆమెకు డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో జ్వరం బారిన పడి, తన మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. *ఐదు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు పలు వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారించారు.* ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. మేడారం జాతర, ప్రభుత్వ కార్యక్రమాలను మంత్రి పర్యవేక్షిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో మేడారం సమ్మక్క సారక్క జాతరలో మంత్రి పాల్గొంటారని సమాచారం.