| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఐ డి ఓ సి లో కార్యాలయాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

ఐ డి ఓ సి లో కార్యాలయాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

డైలీ భారత్, మహబూబాబాద్: సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయంలోని కార్యాలయాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శనివారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

ముందుగా జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం వైద్యశాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ సంక్షేమం, వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ, భూగర్భ జల శాఖ, జి. సెక్షన్, కమర్షియల్ టాక్స్ కార్యాలయం, పే అండ్ అకౌంట్స్, ఉపాధి కల్పన శాఖ, పశుసంవర్ధక శాఖ, మైన్స్, లీగల్ అండ్ మెట్రాలజీ, రికార్డ్ రూమ్, కలెక్టర్ పరిపాలన విభాగం సందర్శించి హాజరు రిజిస్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్యాలయాలలో పరిశుభ్రత మరుగుదొడ్ల నిర్వహణ తీరు ఐడిఓసి పరిసరాల పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు.

Previous వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుసేని
Next ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలి : జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఏ.అంబరీష్
ADVERTISEMENT