ఏడుకొండల స్వామి దయవల్ల అంతా మంచే జరుగుతుంది
అన్నదానం.. మహాదానం..
కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయవల్ల అందరికీ మంచే జరుగతుందని... ప్రతి ఒక్కరూ భక్తీ భావాన్ని కలిగి ఉండి సమాజంలో ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నత జీవన గమనాన్ని అలవరుచుకోవాలని కాంగ్రెస్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం ఫరూక్ నగర్ లోని పెద్ద జానంపేటలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతి రెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా అన్నదానం మహాదానం అని ఆన్ని దానాల్లో కెల్ల అన్నదానం గొప్పదని ఆయన అన్నారు.