Posted on 2026-07-13 18:11:11
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: షాబాద్లో చోటుచేసుకున్న ఆరు హత్యల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విడాకులు ఇవ్వమని అడిగిందన్న కారణంతోనే నిందితుడు రాజ్కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడని సమాచారం. తన విచ్చలవిడి జీవితానికి అడ్డువస్తుందనే కారణంతో ఆమెను అడ్డు తొలగించుకునేందుకు ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజ్కుమార్, సరిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. రాజ్కుమార్ ఇంటర్మీడియట్ చదివే సమయంలో సరిత దగ్గరకు ట్యూషన్ చెప్పించుకోవడానికి వెళ్లాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధించటం మొదలెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సరిత తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలెట్టారు. సరితను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో రాజ్కుమార్ వచ్చిన సంబంధాలను చెడగొట్టాడు. వయసులో తనకన్నా ఆరేళ్లు పెద్దదైన సరితను 2018లో పెళ్లి చేసుకున్నాడు. డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న రాజ్కుమార్.. బెట్టింగులు, జూదం వంటి వ్యసనాలకు బానిస అయ్యాడు. రెండు కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. చనిపోతానని బెదిరించటంతో అతడి తల్లిదండ్రులు కొంత పొలం అమ్మేసి అప్పులు తీర్చారు. ఆ తర్వాత తల్లిదండ్రులను నమ్మించి మొత్తం పొలం అమ్మేలా చేశాడు. జల్సాలకు, మద్యానికి బానిసైన రాజ్ కుమార్.. తరచూ మద్యం సేవించి సరితను వేధించేవాడు. రాజ్కుమార్ వేధింపులు తాళలేకపోయిన సరిత విడాకులు అడిగింది. దీంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి సరితను, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు..
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >
రీ-సర్వేను అడ్డుకుని, కులం పేరుతో దూషణలు... మరిపెడ బంగ్లాలో భూ యజమానుల బాగోతం!
Posted On 2026-07-13 15:55:48
Readmore >
పెంజర్ల వెంచర్లో దొరికిన మృతదేహం.. షాబాద్ సీరియల్ కిల్లర్ కథ ముగిసిందా?
Posted On 2026-07-13 13:56:11
Readmore >
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు... రాజన్న సిరిసిల్లలో నిబంధన అమలు...
Posted On 2026-07-13 13:25:59
Readmore >
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >