Posted on 2026-07-13 13:56:11
డైలీ భారత్, రంగారెడ్డి, కొత్తూరు:షాబాద్ ప్రాంతాన్ని వణికించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడి కథకు ముగింపు పలికినట్లు కనిపిస్తోంది.
కొత్తూరు మండలం పెంజర్ల వెంచర్లో ఈరోజు తెల్లవారుజామున ఒక మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడు షాబాద్ 6 హత్యల కేసులో కీలక నిందితుడైన రాజ్కుమార్ అని గుర్తించారు.
మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ లభించడంతో పోలీసులు ప్రస్తుతం ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఫోరెన్సిక్ అధికారులు స్థలంలో ఆధారాలు సేకరించారు.
గత కొన్ని వారాలుగా షాబాద్ పరిధిలో వరుసగా 6 హత్యలు జరిగి స్థానికుల్లో భయాందోళన రేపాయి. ఈ ఘటనల వెనుక రాజ్కుమార్ హస్తం ఉందని పోలీసులు గుర్తించారు.
ఇప్పుడు ప్రధాన నిందితుడే చనిపోవడంతో కేసు దర్యాప్తు ఏ దిశగా వెళ్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో షాబాద్ కేసులో కొత్త మలుపు తిరిగింది.
#Shabad6Murders #Rajkumar #Kothur #Rangareddy #TelanganaCrime #BreakingNews
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >