డైలీ భారత్, హైదరాబాద్:2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల గుర్తింపుకు జారీ చేసే అఫిలియేషన్ నోటిఫి కేషన్ను వారం రోజుల్లో జారీ చేయనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
కళాశాలల గుర్తింపు, అదనపు సెక్షన్ల అనుమతికిగానూ ప్రతి ఏటా ఇంటర్ బోర్డు.. జూనియర్ కాలేజీల నుంచి దరఖాస్తులను ఆహ్వాని స్తోంది.
నిర్దేశిత ఫీజును చెల్లించి ఆయా కళాశాల యాజ మాన్యాలు ఇంటర్ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది.