Posted on 2026-05-28 11:02:35
బక్రీద్ వేళ సిరిసిల్లలో ముస్లింల వినూత్న డిమాండ్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వినూత్నంగా నిరసన తెలిపారు. సిరిసిల్లలోని ఈద్గాలో శాంతియుత వాతావరణంలో ప్రార్థనలు పూర్తి చేసుకున్న అనంతరం వారు ప్లకార్డులతో ఈ డిమాండ్ ను వినిపించారు. దేశంలో ఆవుల పేరుతో జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఎవరూ ఆవులను బలి ఇవ్వవద్దని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. జాతీయ పక్షిగా నెమలికి ఉన్న గౌరవం మరియు హోదా ఆవుకు కూడా కల్పించాలని, ఆవును జాతీయ జంతువుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని వారు కోరారు. మత సామరస్యానికి ప్రతీకగా సాగిన ఈ కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశమైంది.
సర్జరీ లేకుండానే వాల్ మార్పిడి చేయవచ్చు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య
Posted On 2026-05-28 21:35:53
Readmore >
కామారెడ్డిలో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా కలకలం... అక్రమ తుపాకీతో వ్యాపారవేత్త కిడ్నాప్కు స్కెచ్!
Posted On 2026-05-28 20:21:50
Readmore >
గాలి వర్షానికి నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-28 18:25:02
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్ ఓ పి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-05-28 18:18:15
Readmore >
35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ ద్వారా పారదర్శక బదిలీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-05-28 10:04:11
Readmore >
దేశ సరిహద్దులకు 15 కి.మీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేయాలి : అమిత్ షా
Posted On 2026-05-27 18:46:07
Readmore >