Posted on 2026-05-28 06:34:11
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో తేది 27-06-2026 నాడు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో 35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ పద్ధతిలో బదిలీ ప్రక్రియ నిర్వహించబడింది. ఇందులో నిజామాబాద్ జిల్లా నుండి బదిలీపై వచ్చిన 32 మంది హోం గార్డ్స్ తో పాటు జిల్లాలో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న 3 మంది హోం గార్డ్స్కు బదిలీలు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతి హోం గార్డుతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి విల్లింగ్, సీనియారిటీ, స్పౌస్ ప్రాధాన్యత, ఆరోగ్య పరిస్థితులు, రికార్డులను పరిగణలోకి తీసుకొని పూర్తిగా పారదర్శకంగా కౌన్సిలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హోం గార్డ్స్ అందరూ క్రమశిక్షణతో తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్లలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల మర్యాదతో వ్యవహరించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
పోలీస్ శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ఒక్కరి నిర్లక్ష్యం మొత్తం శాఖ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ పనితీరును మెరుగుపరుచుకొని, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె. నరసింహారెడ్డి, ఆర్ఐలు సంతోష్, నవీన్ కుమార్, కృష్ణ , ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >