| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కుటుంబ కలహాలతో భార్య భర్తల ఆత్మహత్య?

కుటుంబ కలహాలతో భార్య భర్తల ఆత్మహత్య?

డైలీ భారత్, ఆదిలాబాద్ జిల్లా:ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండలం కొలార్హిలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్య చేసుకున్న దంపతులను పల్లివి(22), విజయ్(24)గా గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లివి ముందు పురుగుల మందు తాగింది. భార్యమరణం తట్టుకోలేక భర్త విజయ్ కూడా పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే విజయ్ మరణించాడు.

గతేడాది మేలో పల్లవి, విజయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.....

Previous కుటుంబ కలహాలతో భార్య భర్తల ఆత్మహత్య?
Next కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య?
ADVERTISEMENT