డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ ప్రగతినగర్ కు చెందిన సందవేణి రజిత-విష్ణుప్రసాద్ ల కూతురు నీలిమ వివాహం సందర్భంగా సోమవారం రోజు 36 వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు 50 కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వధువు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, భాగ్యనగర్ నరేంద్ర బాబు, పురుషోత్తం, లింగంపెల్లి దేవయ్య, కుల్ల శ్రీనివాస్, కోడూరి మల్లేశం, గడ్డం శంకర్, బోయిని శ్రీనివాస్, వధువు బంధువులు పాల్గొన్నారు.
News
వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు