డైలీ భారత్, న్యూ ఢిల్లీ : ఢిల్లీలో ఘోరం జరిగింది. ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.
పీతమ్ పురాలోని ఓ అపార్టు మెంటులో గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
వీరంతా రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన వారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు...