డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో సైబీరియన్ కొంగలు సందడి చేశాయి. మోపాల్ మండలం బైరాపూర్లోని కుంటల్లో శుక్రవారం కొంగలు అటు ఇటూ తిరుగుతూ కనిపించాయి. కొంగలు వాతావరణానికి తగినట్లు వలస వెళ్తుంటాయి. అలానే ఇక్కడకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అవి కొత్తగా కనిపించడంతో అక్కడున్న వారు వాటిని తమ ఫోన్లలో బంధించారు. ఇలాంటి కొంగల్ని చూడడం ఇదే మొదటిసారి అంటున్నారు.
News
జిల్లాలో సందడి చేస్తున్న సైబీరియన్ కొంగలు