Posted on 2025-11-10 13:20:48
డైలీ భారత్, హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) కన్నుమూశారు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(సోమవారం) అందెశ్రీ తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉదయం7:25 నిమిషాలకు మరణించినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
అందెశ్రీ ప్రస్థానం ..
1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు.
అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య.
అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం రచించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
ఇటీవల రూ.కోటి పురస్కారం తెలంగాణ ప్రభుత్వం అందించింది.
కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట.
2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం పొందారు.
2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ సాధించారు.
2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు.
2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం తీసుకున్నారు.
2022లో జానకమ్మ జాతీయ పురస్కారం సాధించారు.
2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం పొందారు.
లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు..
కొనుగోళ్ళు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-27 16:35:33
Readmore >
వివోఏల నిరవధిక సమ్మెకు బిఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం...
Posted On 2026-05-27 16:31:01
Readmore >
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >