Posted on 2025-10-08 11:56:50
చేత కాకపోతే జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి..
బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లాలో ఆర్ఓబి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి ఏళ్లు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ కు కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించడంలో పూర్తిగా విఫలం చెందిందని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం మాధవ్ నగర్ ఆర్ఓబి బ్రిడ్జి వద్ద బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీర్పు నిరసనగా రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం మట్టిని తవ్వి గుంటల్లో పేర్చారు. జిల్లా కాంగ్రెస్కే పెద్దమనిషిగా చెప్పుకునే సుదర్శన్ రెడ్డి మంత్రిగాని మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా ఇదే అయినప్పటికీ ఆరోపణల్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆర్ఓబి పనులు త్వరగా చేపట్టకపోవడం వల్ల రోజుకు పదుల సంఖ్యలో గుంతలో పడి గాయాల పాలవుతున్నారని ఆయన అన్నారు. కేవలం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతాకానితనం వల్లే జిల్లాకి ముఖద్వారం లాంటి మాధవ నగర్ ఆర్ఓబి పనులు నిలిచిపోవడం సిగ్గుచేటు అన్నారు. వారికి చేతకాకపోతే రాజీనామా చేయాలని మండిపడ్డారు. రాస్తారోకో కార్యక్రమం వల్ల భారీగా వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. బిజెపి జిల్లా కార్యదర్శి రాంపల్లి జ్యోతి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బీ వరలక్ష్మి, నిజామాబాద్ నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ నిజామాబాద్ నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతాన్ కర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-05-05 13:06:31
Readmore >
కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్
Posted On 2026-05-05 12:50:37
Readmore >
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >