| Daily భారత్
Logo




ప్రజాస్వామ్యానికి దొంగఓట్లు గొడ్డలి పెట్టు : మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

News

Posted on 2025-10-07 16:31:18

Share: Share


ప్రజాస్వామ్యానికి దొంగఓట్లు గొడ్డలి పెట్టు : మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

ఆకులమైలారంలో సంతకాల సేకరణలో కిచ్చెన్న

రాజ్యాంగం, రిజర్వేషన్లపై బీజేపీ దాడి చేస్తోంది

మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న కొన్ని వర్గాల ఓట్లను బీజేపీ ఈసీ తొలగిస్తూ,కుట్రలకు పాల్పడుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆరోపించారు.మంగళవారం  కందుకూరు మండలం ఆకులమైలారంలో ఓట్ల చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేఎల్ఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా కేంద్ర సర్కార్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజ్యాంగంపై దాడి చేయటం ఈసీతో కుమ్మక్కు అయి అర్హుల ఓట్లను తొలగిస్తున్నారని లక్ష్మారెడ్డి మండిపడ్డారు.

అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.కులం, మతం ఆధారంగా ఓట్లను తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నట్లు కేఎల్ఆర్ గుర్తు చేశారు.బీఆర్ఎస్ హయాంలో జల్ పల్లి మున్సిపాలిటీలో వేలాది దొంగఓట్లు నమోదు చేశారని కిచ్చెన్న ఆరోపించారు.అర్హుల ఓట్లు తొలగించినా... బయట వ్యక్తుల ఓట్లు నమోదు చేసినా... ఉద్యమించాలని మహేశ్వరం నియోజకవర్గం పిలుపునిచ్చారు.

రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని అంతం చేయాలని బీజేపీ చూస్తుందని కేఎల్ఆర్ విమర్శించారు. ప్రతీ బూత్ స్థాయిలో వంద సంతకాలు పెట్టించి ఈసీకి నిరసన తెలపాలని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ ఆధ్వర్యంలో పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు, మహేశ్వరం మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు.

Image 1

ఆత్మహత్యలను ఆపలేమా..?

Posted On 2026-05-05 19:19:08

Readmore >
Image 1

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

Posted On 2026-05-05 19:04:31

Readmore >
Image 1

మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

Posted On 2026-05-05 18:58:50

Readmore >
Image 1

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

Posted On 2026-05-05 18:40:21

Readmore >
Image 1

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

Posted On 2026-05-05 18:33:11

Readmore >
Image 1

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Posted On 2026-05-05 18:26:59

Readmore >
Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >
Image 1

పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:24:21

Readmore >
Image 1

జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:21:35

Readmore >
Image 1

సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం

Posted On 2026-05-05 16:16:41

Readmore >