డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి ఆవునూరి దయాకర్ రావు అన్నారు. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో దయాకర్ రావు మాట్లాడుతు తెలుగుదేశం పార్టీని సమస్తగతంగా అభివృద్ధి చేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ సత్తా చాటుతామని గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్,బిఆర్ఎస్ చేసింది ఎం లేదు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తీగల శేఖర్ గౌడ్,దుమాలా సత్యనారాయణ,ఆడేప్ లక్ష్మీనారాయణ,మ్యాన వేంకటేశం,బింగి వేంకటేశం,రంగు శేషచలం,మహిళా నాయకురాలు వరలక్ష్మి,శ్యాగ ప్రశాంత్,మిద్దె ప్రకాష్, పంజా బాలరాజు,జెట్టి కొమురయ్య, పండుగ స్వామి,బేతి రవీందర్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు