విద్యార్థుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం
రోజుకో సంఘటన బయటికి వస్తున్న వైనం
శివశంకర్ నిర్లక్ష్యణులపై ఫైర్
డైలీ భారత్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, దమ్మపేట, ఖమ్మం జిల్లాలో కల్లూరు లో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు చిన్నచూపు చూడటం, హేయమైన చర్య అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్ఎస్పి పార్టీ మీడియా కోఆర్డినేటర్ చేని శివశంకర్ సరైన పోషక ఆహారం అందించకపోవడం విద్యార్థుల అవస్థపడటం కేవలం ఉపాధ్యాయుల నిర్లక్ష్యమేనని ఎద్దేవా చేశారు,
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్ఎస్పి పార్టీ మీడియా కోఆర్డినేటర్ చేని శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్లో జరుగుతున్నటువంటి దారుణాలు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం, సమ రహస్యంగా విద్యార్థులను మధ్య పరీక్షలు చేపించి గుట్టు సప్పుడు కాకుండా బహిర్గతంగా తెలియకుండా జాగ్రత్త పడటం పై మండిపోటుకు గురయ్యారు,
ఇప్పటికే పలుచోట్ల కల్లూరులో, దమ్మపేటలో, భద్రాచలంలో ఆలస్యంగా ఫుడ్ పాయిజన్ లాంటి అవాంఛనీయ సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ కనీస సంబంధిత విద్యాశాఖ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై పలు అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి అని శివశంకర్ వాపోయారు,
కేవలం ఇది ప్రశ్నించే వాళ్ళు లేక ఎంతటి నిర్లక్ష్యం ధోరణికి ఉపాధ్యాయులు శరణ గీతం పాడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు,
మరికొన్నిచోట్ల ఆహారంలో పురుగులు రావడం, సరిగా బియ్యం సైతం ఉడకపోగా విద్యార్థులకు కడుపు నొప్పులు సైతం వచ్చి రహస్యంగా తల్లిదండ్రులను పిలిపించి ఇళ్లకు పంపిన సందర్భాలు మరెన్నో ఉన్నాయి,
అధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అనేక ప్రభుత్వ హాస్టల్లో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు బయటికి రావటం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు సమన్యాసమని శివశంకర్ హెచ్చరించారు,
ఇకనైనా నిర్లక్ష్య ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే మునుముందు ఎన్ఎస్పి పార్టీ తరఫున బహిరంగ బహుర్ మోహంగా ప్రతి ఒక్క చోట మా కార్యకర్తలతోటి ధర్నా నిర్వహించే రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు,