Posted on 2025-07-13 19:55:48
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాతృమూర్తి రేగా నర్సమ్మ ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో టియుడబ్ల్యూజే ఐ జే యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలు రేగా కాంతారావును ఆదివారం నాడు కరకగూడెం వారి స్వగృహంలో పరామర్శించారు. పరామర్శించిన వారిలో అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏర్పుల సుధాకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు వంగూరి నాగేశ్వరరావు, మణుగూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పిండిగ వెంకట్, బిఆర్ఎస్ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు కర్నే మురళి, ఐజేయు నాయకులు నాగేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >