Posted on 2025-04-21 22:17:46
డైలీ భారత్, మాసాయిపేట:మాసాయిపేట శివారులో ఏర్పాటు చేసిన హల్ది గోల్డ్ కౌంటి వెంచర్ లోని కుమ్మరి కుంటలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి చదును చేస్తుండగా, గ్రామస్థుల నుండి అందిన ఫిర్యాదు మేరకు మాసాయిపేట తాసిల్దార్ జ్ఞానజ్యోతి సమక్షంలో వెల్థుర్థి డిప్యూటీ సబ్ ఇంజనీర్, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ అధికారులు సోమవారం సంయుక్తంగా సర్వే నిర్వహించారు. కుమ్మరి కుంటలో అక్రమ తవ్వకాలు జరిపి త్రవ్విన భూమిని గోల్ఫ్
కౌంటి తరలించినట్లు తెలిపారు. ఇట్టి శిఖం గురించి మండల సర్వేయర్ తెలుపుతూ సర్వే నెంబర్ 827 లో ఇప్పటికే సర్వే పూర్తి అయ్యిందని తెలిపారు. సర్వే నెంబర్ 827 పట్టా భూమి అయినప్పటికీ సర్వే నెం. 827 పార్ట్ శిఖం కిందకు వస్తుందన్నారు. కుమ్మరి కుంట భూమి ఎఫ్టీఎల్ శిఖం కిందకు వస్తుందని, త్వరలోనే హద్దులు ఏర్పాటు చేసి, శిఖం భూమిలో అక్రమ తవ్వకాలు చేపట్టిన వారు, అట్టి శిఖం కుంటను యథావిధిగా చేయాలని, త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది
Posted On 2026-03-12 21:53:55
Readmore >
శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Posted On 2026-03-12 21:52:35
Readmore >
కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
Posted On 2026-03-12 18:49:30
Readmore >
కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-12 18:47:14
Readmore >
బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక
Posted On 2026-03-12 18:45:43
Readmore >