అంటు వ్యాధులు ప్రబల కుండా చూడు తల్లి
మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గం కోళ్లపడకల్, పోరండ్ల గ్రామాల్లో జరిగిన పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.
ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ... అమ్మవారి దయవల్ల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఎలాంటి అంటు వ్యాధులు గ్రామాల్లో ప్రబలకుండా గ్రామదేవత కాపాడుతుందని.. బోనాల ఉత్సవాల్లో అందుకే అమ్మవారికి మొక్కులు చెల్లిస్తామని గుర్తుచేశారు.
ఈకార్యక్రమంలో మహేశ్వరం, కందుకూరు మండల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.