డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రేపు గురువారం 27 వ తేది ఏంపిడిఓ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న కారణంగా షాద్నగర్ యువసత్తా లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చీట్టనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ
ఈ నిరసన కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రతి ఒక్కరూ హాజరు అయ్యి మద్దతు తెలపాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.
అదే విధంగా పీజులు ముక్కు పిండి మరీ వసూలు! ఇరుకైనా గదులు, గాలి వచ్చి పోయే అవకాశం లేదు కానీ! పీజు ఆలస్యమైతే మాత్రం విద్యార్థిని అంటరాని వాడి గా బయట నిలబెట్టి అవమానించిడం, ప్రశ్నించడం, చేతకాని తల్లి తండ్రులుఅని, పలువురు విద్యార్థుల ముందు అవమానించడం జరుగుతుందని కార్పొరేట్ పాఠశాలలలో పిల్లలకు గ్యారంటీ లేదు అని, ఏం చేయలేక తల్లిదండ్రులు మవునంగా ఉండడం, విద్యా శాఖకు మంత్రి లేడు!మద్యం శాఖకు మంత్రి ఉండు. ఇది మన దౌర్భాగ్యం డీఈఓ, ఏం ఈ ఓలు పేరుకే ఉన్నారని లక్ష్మణ్ మండిపడ్డారు...
పాఠశాలలో ఏమి జరిగిన అంతా గప్, చుప్ అంతా లక్ష్మి కాంత్ ప్యారేలాల్ మహిమ అని ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరవాలని అయన అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించాలి. రేపే దీక్ష ప్రారంభం...
విద్యార్థులకు అండగా అందరు మద్దతు తెలపాలని యువ సత్తా లక్ష్మణ్ కుమార్ కోరారు..