డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్: ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవీ ప్రమాణం చేయించారు.
కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు, వేల మంది అభిమానులు హాజరయ్యారు.
విభజిత ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపడుతుండడం ఇది రెండోసారి.