డైలీ భారత్, హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్లో అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. శనివారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ మాజీ సీఎం ఠాకూర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఆశిష్, హోషియార్, కెఎల్ ఠాకూర్ శుక్రవారం తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ఈ ముగ్గురు కూడా శనివారం బీజేపీలో చేరారు.
News