| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎన్నికలవేళ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడి సోదాలు

ఎన్నికలవేళ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడి సోదాలు

డైలీ భారత్, హైదరాబాద్:బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈరోజు ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి.

ఢిల్లీ నుంచి వచ్చిన హైద రాబాద్‌లోని కవిత నివా సానికి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ సోదాలు చేస్తోంది. ఐటీ, ఈడీ అధికారులతో కలిసి జాయింట్‌గా.. మొత్తం నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనీఖీలు చేస్తున్నారు.

మరోవైపు కవిత నివాసం ముందు భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు.. పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకుంటున్నారు. పార్ల మెంట్ ఎన్నికల ముందు ఈ సోదాలతో బీఆర్ఎస్‌లో ఒకింత ఆందోళన మొదలైంది.

కాగా..ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత నిందితురాలు ఉన్న విషయం తెలిసిందే. పలు మార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపి నప్పటికీ ఈ మధ్య హాజరు కాలేదు..

Previous బాధ్యతలు చేపట్టిన నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్లు
Next మాజీ సీఎం కేసీఆర్ ను భువనగిరి ఎంపీ టికెట్ కోరిన శ్రీకాంత్ చారి తల్లి
ADVERTISEMENT