Posted on 2024-02-26 07:56:09
డైలీ భారత్, ములుగు: మేడారం జాతర సందర్భంగా కాలాడేరా మలక్పేట్ హైదరాబాద్ కి సంబంధించిన రోహిత్ లాల్ s/o మున్నా లాల్ 21 సంవత్సరాలు అను వ్యక్తి స్థానిక తన స్నేహితునితో కలిసి చిలకలగుట్ట వెనుక భాగంలో ఉన్న దయ్యాల మడుగు అనే ప్రదేశంలో ఈత గొడుతూ ప్రమాదవశాత్తు మృతిచెందగా సమాచారం అందుకున్న ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్ సి సి ఎస్ సి ఐ అనుముల శ్రీనివాస్ సాహసోపేతంగా జంపన్న వాగులోకి స్వయంగా దిగి రెండున్నర గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీసి తమ బంధువులకు అప్పగించారు.
అనంతరం ములుగు ఏరియా హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ సందర్భంగా చనిపోయిన రోహిత్ లాల్ వారి బంధువులు ములుగు జిల్లా పోలీస్ వారికి అత్యంత ధైర్య సాహసోపేతాలు ప్రదర్శించి మృతదేహాన్ని వెలికి తీసి తమకు అప్పగించిన సీఐ కిరణ్ సీఐ శ్రీనివాస్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >