అతితక్కువ ఐఆర్ ప్రకటన పట్ల యుయస్పిసి ఖండన
డైలీ భారత్, సిరిసిల్ల: ప్రభుత్వము అతి తక్కువ IR ప్రకటించినందుకు USPC ఆధ్వర్యంలో కుసుమ రామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శివానగర్, సిరిసిల్లలొ నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఏక పక్షంగా కేవలం 5% మధ్యంతర భృతి ప్రకటించటాన్ని యుయస్పిసి తీవ్రంగా ఖండిస్తున్నది. అతి తక్కువ ఐఆర్ ప్రకటనను నిరసిస్తూ, పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్లులు వెంటనే ముంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపారు.
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపు మేరకు
యుయస్పీసి భాగస్వామ్య సంఘాల సభ్యులుTPTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్ రెడ్డి, జిల్లా UTF అధ్యక్షుడు పాకాల శంకర్ గౌడ్,BTF జిల్లా అధ్యక్షుడు కుమ్మరి మల్లేశం,TPTF జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారపు పురుషోత్తం మరియు పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు