డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. యూసు ఫ్ గూడ సమీపంలో బుధ వారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది.
సింగోటం రాము తరచూ ఈ ఏరియాకి వస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. అయితే వివాహేతర సంబంధం బెడిసి కొట్టడంతో.. పదిమంది మనుషులు అక్కడకు చేరుకుని రామును బంధించి మర్మంగాలు కోసేశారు. వెంటనే గొంతు కోసి చంపేసినట్లు తెలుస్తోంది.
ఈ సమాచారం అందుకున్న డీసీపీ సాయిచైతన్య.. స్పాట్కు చేరుకున్నారు. మర్డర్ జరిగిన తీరు పోలీసులనే షాక్కు గురిచేసింది. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు.
పోలీసులు. సింగోటం రాము పాలమూరులో రాజకీయ నాయకుడు కావాలని అనుకుంటున్నారు. ఈసారి నాగర్కర్నూల్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు రాజకీయ కోణంలోనూ ఈకేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్, యూట్యూ బ్లోనూ సింగోటం రాము ఫేమస్. హత్యకు గల పూర్తి వివరాలు తెలియవలసి ఉంది..