| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

News

Posted on 2026-08-21 16:12:19

Share: Share


ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఇంటి అనుమతి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

రూ. 13 వేలు ఫోన్ పే చేయించుకుంటూ దొరికిపోయిన అధికారిణి..

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ ట్రాప్...లింగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి అరెస్ట్

డైలీ భారత్, మంచిర్యాల:ఇంటి నిర్మాణం, ఇంటి నంబర్ కేటాయింపు కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి ఎసిబి అధికారులకు చిక్కారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి జె. వరలక్ష్మి, కొత్తగా నిర్మించిన ఇంటికి అనుమతి, నంబర్ కేటాయించడం కోసం బాధితుడి నుంచి రూ.20,000 డిమాండ్ చేశారు. చివరకు రూ.13,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. నగదు రూపంలో కాకుండా మరొక పంచాయతీ కార్యదర్శి లావణ్య ఫోన్ పే నంబర్‌కు ఆ మొత్తాన్ని బదిలీ చేయాలని సూచించారు. బాధితుడు ఆ డబ్బును ఫోన్ పే ద్వారా పంపించగా, లంచం డిమాండ్ చేసిన ఆధారాలతో సహా ఆదిలాబాద్ ఏసీబీ యూనిట్ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.

Image 1

కుతుబ్‌షాహీ సమాధుల వద్ద బయటపడ్డ రహస్య సొరంగం...

Posted On 2026-08-21 17:33:53

Readmore >
Image 1

మోతే దంపతుల హత్య కేసులో సంచలన చర్య... కానిస్టేబుల్ డిస్మిస్

Posted On 2026-08-21 17:32:43

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Posted On 2026-08-21 16:12:19

Readmore >
Image 1

సినీ లోకంలో తీరని శోకం! శ్వాసకోశ సమస్యలతో కన్నుమూసిన మహానటి "షావుకారు" జానకి...

Posted On 2026-08-21 13:15:46

Readmore >
Image 1

సిరిసిల్లలో పొక్సో నిందితుడికి 4 ఏళ్ల జైలు శిక్ష... బాలికల పట్ల అసభ్య ప్రవర్తన

Posted On 2026-08-21 10:25:46

Readmore >
Image 1

ఢిల్లీ పేరు మారనుందా?

Posted On 2026-08-21 07:10:13

Readmore >
Image 1

సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ లో సత్తా చాటిన మరిమడ్ల విద్యార్థి... జావలిన్ త్రోలో సిల్వర్, రాష్ట్రస్థాయికి సెలెక్ట్

Posted On 2026-08-20 17:43:07

Readmore >
Image 1

రూ. 20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన జీపీఓ...

Posted On 2026-08-20 17:17:54

Readmore >
Image 1

ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు కఠినం : పోలీస్ కమిషనర్ బి. సుమతి

Posted On 2026-08-20 17:09:57

Readmore >
Image 1

22ఏ సమస్యపై ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం.. ప్రజలకు పూర్తి భరోసా

Posted On 2026-08-20 17:06:43

Readmore >