| Daily భారత్
Logo




హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

News

Posted on 2026-08-11 13:59:26

Share: Share


హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు  కూనంనేని  సాంబశివరావు 

ప్రజాస్వామ్య పరిరక్షణకు మార్పు అవసరం 

ప్రజా చైతన్య యాత్రకు  జూలూరుపాడు మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ 

డైలీ భారత్, జూలూరుపాడు: జూలూరుపాడు కేంద్రంలో మోడీ సర్కార్ నియంతృత్వ పోకడలు. రాష్ట్రంలో హామీలను గాలికి వదిలి ప్రజల సమస్యల పరిష్కరించడం లేదని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు విమర్శించారు ప్రజా చైతన్య యాత్ర మంగళవారం జూలూరుపాడు చేరుకుంది పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతూ ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రధాన సెంటర్లో ఏర్పాటుచేసిన మీటింగ్ లో సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏ ట రెండు కోట్ల ఉద్యోగాలు  ఖాతాలో 15 లక్షలు , జమ ఉపాధి కల్పన వంటి కీలక హామీలను పక్కనపెట్టి మత విద్వేషాలతో కాలం వెల్లదీస్తుందని ఆరోపించారు నీట్ కుంభకోణంతో లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును చీకట్లో పడేసిందని దీనికి నిరసనగా జంతర్ మంతర్ వేదిక గా విద్యార్థులు యువత సాగించిన పోరాటం మోడీ దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారని  దేశ సంపదను కొంతమంది కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు దేశంలో త్వరితగతిన సామాజిక రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉందని అందుకోసం సిపిఐ నడుం బిగిస్తుందని తెలిపారు యాత్రలో భాగంగా అనంతరం . గాంధీనగర్ వద్ద ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు , పుల్లారెడ్డి కొత్తగూడెం మేయర్ మూడు గణేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్రనరేంద్ర కుమార్, నరాటి ప్రసాద్, చంద్రగిరి శ్రీనివాస్ కంచర్ల జమలయ్య భూక్య శ్రీనివాస్ ఎస్ కే ఫయుం వరక అజిత్ సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు ఎస్కే నాగుల్ మీరా ఎల్లంకి మధు తదితరులు పాల్గొన్నారు

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >