Posted on 2024-03-22 19:47:30
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. రూ.19 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు. వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి తీసుకున్న అమౌంట్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, తస్లీమా ములుగు సబ్ రిజిస్ట్రార్గా గతంలో పనిచేశారు.
భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సాయంత్రం దాడులు నిర్వహించారు. ఒక వ్యక్తి నుంచి సబ్ రిజిస్ట్రర్ మహమ్మద్ తస్లీమా రూ. 19, 200 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం
Readmore >భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్
Readmore >ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్ రైటర్
Readmore >ప్రేమజంట ఆత్మహత్య?
Readmore >ఇంటి పెద్దను హతమార్చిన భార్య, కూతురు
Readmore >ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి
Readmore >అటెండర్తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్
Readmore >