Posted on 2024-04-28 12:21:06
శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు.
అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ,అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా
జిల్లా వ్యాప్తంగా పట్టుబడ్డ 256 మంది యువకులు
81 ద్విచక్ర వాహనాలు సీజ్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ, రోడ్లపై మద్యం సేవించే, అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా శనివారం నాడు రాత్రి ఆపరేషన్ చబుత్రా పేరుతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు.
యవకులు అర్ధరాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లు, ఫుట్పాత్లపై గుంపులుగా జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బంది లకు గురిచేస్తూ, మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో రాష్ డ్రైవింగ్, హారన్లు కొడుతూ, ప్రధాన కూడళ్ల లలో వాహనాలను నిలిపి గుంపులుగా, అనుమానస్పదంగా తిరుగుతున్న 256 మంది యువకులను అదుపులోకి తీసుకోని 81 బైక్ లను సీజ్ చేసి కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ...
అసాంఘిక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని, ముఖ్యంగా యువకులు తమ భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు.అంతేకాకుండా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉన్నదని, తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇకనుండి జిల్లాలో తరచుగా ఆపరేషన్ చబుత్రా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుంది అని అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై అనవసరంగా గుంపులుగా సంచరిస్తూ సామాన్య ప్రజానీకానికి మరియు మహిళల ను ఇబ్బందుల కు, అభద్రత భావానికి గురి చేస్తే వారిపై టౌన్ న్యూసెన్స్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నా రు. యువత చట్టవ్యతిరేకమైన పనుల్లో పాల్గొంటే వారి యొక్క మంచి భవిష్యత్ ను కోల్పోతారు అని సూచించారు.
ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Posted On 2024-05-14 22:33:34
Readmore >ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి
Posted On 2024-05-14 20:54:19
Readmore >ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
Posted On 2024-05-13 13:29:48
Readmore >