Posted on 2024-04-27 19:40:15
డైలీ భారత్, కరీంనగర్: తెలంగాణలో ఏసీబీ లంచగొండి అధికారుల భరతం పడుతున్నారు. రోజుకో చోట ఒకరు ఏసీబీ రెడ్ హ్యండెడ్గా పట్టుబడుతున్నారు. తాజాగా శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చెందిన సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి సబ్ రిజిస్టర్ శివరపు సురేష్బాబును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
బాధితుడు, డాక్యుమెంటర్ అంజయ్య తన స్నేహితుడు అజయ్కుమార్ తండ్రి రాజేశం పేరుమీద ఉన్న నాలుగు గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ చేసి ఇవ్వాలని సబ్ రిజిస్టర్ను సంప్రదించాడు. గిఫ్ట్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్టర్ సురేష్బాబు కార్యాలయానికి చెందిన సబార్డినేట్ కొత్తకొండ శ్రీదర్ ద్వారా రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Posted On 2024-05-14 22:33:34
Readmore >ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి
Posted On 2024-05-14 20:54:19
Readmore >ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
Posted On 2024-05-13 13:29:48
Readmore >ఓటు హక్కు వినియోగించుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2024-05-13 12:52:26
Readmore >ఓటు హక్కు వినియోగించుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి
Posted On 2024-05-13 12:51:09
Readmore >