| Daily భారత్
Logo


ఘోర రోడ్డు ప్రమాదం

News

Posted on 2024-02-27 13:24:39

Share: Share


ఘోర రోడ్డు ప్రమాదం

డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజీవ్‌ రహదారిపై డివైడర్‌ను ఢీ కొట్టిన కారు పల్టీలు కొడుతూ మరో కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

సిద్దిపేట నుంచి హైదరాబాద్‌ వైపు అతివేగంగా వెళ్తున్న కారు కుకునూర్‌ పల్లి వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. రాజీవ్‌ రహదారిపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ.. అవతలవైపు ఎదురుగా వస్తున్న మరోకారును బలంగా ఢీకొట్టింది. అనంతరం గాల్లో ఎగిరి బలంగా రోడ్డుపై పడింది.

ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం

Readmore >
Image 1

భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్

Readmore >
Image 1

ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్‌ రైటర్

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య?

Readmore >
Image 1

ఇంటి పెద్దను హతమార్చిన భార్య, కూతురు

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

Readmore >
Image 1

అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

Readmore >