| Daily భారత్
Logo




మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్

News

Posted on 2025-07-14 11:42:15

Share: Share


మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: వయసు పైబడి ఆరోగ్యం సహకరించక పోయిన, మాల జాతి సంక్షేమం కోసం, భారతరత్న అంబేద్కర్  ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న  చెన్నయ్య ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి!

భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్!

మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పివి రావు  తో సహచరుడిగా, వయసు 70 దాటినా, ఆరోగ్యం సహకరించక ఇటీవల స్టంట్ లు వేయించుకున్న,

మాల జాతి సంక్షేమం కోసం, భారతరత్న అంబేద్కర్  ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ,

మార్గదర్శకుడిగా నిలిచిన త్యాగధనుడు  చెన్నయ్య ప్రతి ఒక్క దళితుడు స్ఫూర్తిగా తీసుకోవాలని

భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.

హైదరాబాదులోని  హోటల్లో బస చేసిన, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు  చెన్నయ్య  , ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి,

శాలువాతో ఘనంగా సత్కరించి ,అభినందించారు.

ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల మాట్లాడుతూ

" మాల జాతి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం మన రాష్ట్రంలో దీక్ష కంకణదారులై పార్లమెంటు సభ్యులు  మల్లురవి , తెలంగాణ రాష్ట్ర గనుల శాఖ మాత్యులు చెన్నూరు శాసనసభ్యులు మరియు కార్మిక శాఖ మంత్రివర్యులు గడ్డంవివేక్ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు , ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ , మాల మహానాడు జాతీయ అధ్యక్షుల జి చెన్నయ్య , మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు  ఎర్రోళ్ల రాములు ,   ఎందరో మహానుభావుల త్యాగపూరితమైన సేవలను గమనంలోకి తీసుకుంటూ మాల జాతి ఐక్యత కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, అదేవిధంగా భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లను కలుపుకొని , మన హక్కుల సాధన కోసం కదం తొక్కి ముందుకు సాగాలని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ పిలుపునిచ్చారు. తనను సత్కరించి అభినందించినందుకు కృతజ్ఞత లు తెలుపుతూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి .చెన్నయ్య  మాట్లాడుతూ "తన ఆఖరి శ్వాస వరకు, మాల జాతి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం , బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం, మీ అందరి సహకారంతో, ఆ భగవంతుడు ఆశీస్సులతో, నిరంతరం ఉద్యమిస్తానని" హర్షద్వానాల మధ్య ప్రకటించారు. కార్యక్రమంలో  జి చెన్నయ్య ,ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, ఆదర్శ ఫౌండేషన్ అధ్యక్షులు నిరంతర సేవా తత్పరులు  కుసుమ భోగరాజు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు మరియు హైకోర్టు అడ్వకేట్ చింతమల్ల సాయిబాబా, కైలాస్ ,తిరుపతి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >
Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >